ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎంపికపై కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు ముగిసినది . గత ఐదు రోజులుగా విస్తృత చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బాఘెల్ వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గుచూపింది. రాయ్పూర్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇవాళ జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించారు. 15 ఏళ్ల తర్వాత ఛత్తీస్గఢ్లో అధికారాన్ని ఏర్పాటు చేయనుంది కాంగ్రెస్ పార్టీ.