వేధింపులతో కుటుంబాన్ని హత్య

SMTV Desk 2017-07-26 13:34:33  murder, family,6 membars

ఖమ్మం, జూలై 26 : ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. కూసుమంచి మండలం జీళ్ళ చెరువు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు తెల్లవారు జమున పాడేరు జలాశయంలో శవాలుగా తేలారు. దీనిని మొదటగా ఆత్మహత్యగా భావించిన పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా మరో కొత్త కోణం బయటకు వచ్చింది. జరిగింది ఆత్మహత్య కాదని, హత్య అని పోలీసులు తేల్చారు. మృతుల్లో ఒకరైన షేక్ సలీం పథకం ప్రకారం హత్య చేశాడు. మొదట తండ్రిని కట్టేసి కెనాల్లో పడేసిన సలీం ఆ తరువాత తల్లి, భార్యను కలిపి కాలువలో పడేశారు. అనంతరం ఇద్దరు చిన్నారులను ఒక చోట కట్టి కాలువలో పడేసి అతను కూడా కాళ్లు, చేతులు కట్టేసుకొని కాలువలోకి దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు. సలీం ఈ ఘోరం చేయడానికి కారణం తండ్రి మద్యానికి బానిసవడమేనని, అలాగే కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడంతో హాత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.