అయోధ్య లో హిందూదేవాలయాల కూల్చివేత

SMTV Desk 2018-12-15 11:15:32  hindu,ayodya,rama mandir

అయోధ్య, డిసెంబర్ 15 :
శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పడగొట్టే అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయంపై రామ్ జన్మభూమి న్యాస్, విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) రిజర్వేషన్లు వ్యక్తం చేశారు. అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ 138 భవనాల కూల్చివేతకు నోటీసులు ఇవ్వగా వాటిలో 500 నుండి 600 సంవత్సరాల వయస్సు గల దేవాలయాలు కూడా ఉన్నాయి.

ఆలయాల పునరుద్ధరణను డిమాండ్ చేస్తూ, విహెచ్పి యొక్క ప్రాంతీయ ప్రతినిధి మాట్లాడుతూ: "అయోధ్యలో గులాబ్ బాడీ మరియు బాహు బేగం కా మక్బరా ను సంరక్షించవచ్చు ? మేము ఎందుకు చారిత్రాత్మక ఆలయాలను పునరుద్ధరించకూడదు?" అని ప్రశ్నించారు.

నిధుల కొరత కారణంగా, అయోధ్యలో పెద్ద సంఖ్యలో ఆలయాలు శిధిలమైన నిర్మాణాలుగా మారి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. పట్టణంలో దాదాపు ప్రతి వీదికి ఆలయం ఉంది, కొన్ని 500 సంవత్సరాల నాటినవి కూడా ఉన్నాయి . ఇప్పటికే నయా ఘాట్ వద్ద 500 ఏళ్ల చతుర్భుజ్ మందిర్ ని శిధిలాల జాబితాలో కూల్చివేశారు.

చతుర్భుజ్ ఆలయం యొక్క మహంత్ బలరాందాస్ ఇలా అన్నారు, "దేవాలయాల పునర్నిర్మాణము కొరకు నిధులు లేవు . నిర్వాహణ కష్టమై , ఈ చారిత్రాత్మక ఆలయం శిధిలమైన నిర్మాణంగా మారింది. ప్రభుత్వం నిధులను అందజేయాలి లేదా ఆలయాన్ని పునరుద్ధరించడానికి భారత పురావస్తు సర్వే శాఖను కోరి, నాశనానికి బదులుగా దానిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. "

శ్రీ రామ్ నివాస్, చోటి కుటియా, రామాయణ భవన్, బెటియా మందిర్, హనుమాన్ మందిర్ మరియు శేష్ మహల్ ఆలయాలు కూల్చివేత జాబితాలో ఉన్నాయి.