"స్పైడర్" ను సొంతం చేసుకున్న మహేష్ "

SMTV Desk 2017-07-26 13:24:41  mahesh babu, spyder, harish jai raj,rakul ,murugadas

హైదరాబాద్, జూలై 26 : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న "స్పైడర్ " సినిమా కు ఏఆర్‌ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఏఆర్‌ మురుగదాస్‌, మహేశ్‌ కాంబినేషన్‌లో తొలిసారిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రూ. 150కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది అని తెలిసింది. ఒక్క పాట చిత్రీకరణ చేసుకున్న యూనిట్ . మరోవైపు, విజువల్ ఎఫెక్ట్స్ పనులు కొనసాగిస్తున్నామని .ఈ సినిమా కొరకై వీఎఫ్ఎక్స్ పనులను రష్యా, ఇరాన్‌, యూకే ఇండియాలో కూడా ఈ జరుపుతున్నారు అని. ఇక, మిగిలిన పాటలని ఆగస్టు మొదటివారంలో చిత్రీకరించనున్నారు అని తెలిపారు. పులి సినిమా దర్శకుడు సూర్య, యంగ్ హీరో భరత్ లు విలన్ గా ఈ చిత్రం లో కనిపించనున్నారు అని ఓ సమాచారం. స్పైడర్ షూటింగ్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన మహేష్ బాబు కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న "భరత్ అను నేను" సినిమా షూటింగ్ లో అయిన పలుగొన్నరుఅని విషయం తెలిసింది. స్పైడర్ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు అని సమాచారం. ఈ సినిమా కు హరీష్ జై రాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం తో మహేష్ కు మంచి గుర్తింపు లబిస్తుంది అని సినీ వర్గాలు చెప్తున్నాయి.