'అంతరిక్షాని'కి సర్వం సిద్ధం

SMTV Desk 2018-12-14 18:02:54  varun tej,sankalp reddy,ghazi,lavanya tripati,aditi rao haydari

హైదరాబాద్ , డిసెంబర్ 14 : సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా అంతరిక్షం నిర్మితమైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని యు సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తికావడంతో ఈ నెల 21వ తేదీన భారీస్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
వరుణ్ తేజ్ తో పాటు అదితీరావు వ్యోమగామిగా కనిపించనుండగా, పార్వతీ టీచర్ పాత్రలో లావణ్యత్రిపాఠి కనిపించనుంది. రెహ్మాన్ (రఘు) ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించాడు. సముద్రం - జలాంతర్గామి నేపథ్యంలో ఘాజీ తీసి మెప్పించిన సంకల్ప్ రెడ్డి నుంచి ఈ సినిమా వస్తుండటం మరింత ఆత్రుతను పెంచుతోంది.తెలుగులో తొలిసారిగా అంతరిక్షం నేపథ్యంలో నిర్మితమైన సినిమా ఇదే. అందువలన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది.