తెరాస పార్టీ సరికొత్త రికార్డ్..!

SMTV Desk 2018-12-14 15:39:09  KCR, TRS Party New Record

హైదరాబాద్, డిసెంబర్ 14: తాజాగా తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెరాస పార్టీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. తెరాస పార్టీ తరపున గెలిచినా 88 మంది అభ్యర్థులు అత్యున్నత చదువులు చదివి రాజకీయాల్లోకి వచ్చారు. గెలిచినా 88 అభ్యర్థుల్లో ఇద్దరు పి.హెచ్.డి, 24 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 44 మంది గ్రాడ్యుయేట్స్, 9 మంది లాయర్లు, ఐదుగురు ఇంజినీర్లు, నలుగురు డాక్టర్లు ఉన్నారు. ఈ ప్రభుత్వం చరిత్రలో అత్యంత విద్యావంతులైన ప్రతినిధులున్న ప్రభుత్వంగా రికార్డు సృష్టించింది.