హైదరాబాద్ , డిసెంబర్ 14:
అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను నిర్మితమైంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో అఖిల్ కి జంటగా నిధి అగర్వాల్ కనువిందు చేయనుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో వస్తున్న ఏ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి వొక లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు.
"ఏమైనదో ఏమైనదో పలుకు మరిచినట్టు పెదవికేమైనదో .. ఏమైనదో ఏమైనదో బరువు పెరిగినట్టు గుండెకేమైనదో.. " అంటూ ఈ పాట కొనసాగుతోంది. తమన్ బాణీకి శ్రీమణి సాహిత్యం తోడై అర్మాన్ మాలిక్ ఆలాపన ఈ పాటకి యువతలో మంచి స్పందన వచ్చే అవకాశం వుంది . ఈ పాట కోసం ఫస్టు టైమ్ స్ట్రింగ్స్ వయోలిన్స్ సెక్షన్స్ వాడినట్టుగా తమన్ తెలిపాడు. ప్రేక్షకుల ముందుకు జనవరి 25వ తేదీన ఈ సినిమా రానుంది.