ఖమ్మం జిల్లా పాలేరులో విషాదం

SMTV Desk 2017-07-26 11:24:20  khammam, paleru, tummala

ఖమ్మం జిల్లా పాలేరులో విషాదం చోటు చేసుకుంది. కూసుమంచి మండలం జీళ్ళచెర్వుకు చెందిన పెంటుసాహెబ్ కుటుంబం ఆర్దిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ప్రతీ రోజు పెంటుసాహెబ్ మద్యం సేవించి ఇంటికి వచ్చి కుటుంబసభ్యులను రోజు కొట్టడంతో, గ్రామంలో భూవివాదాలు, చుట్టు ప్రక్కల ఉన్నవారితో కూడా గొడవలు పెట్టుకోవడంతో పాటు కుటుంబకలహాలు తోడవడంతో విసిగెత్తి పోయిన కుటుంబ సభ్యులు ఆత్మహత్యే తమకు శరణ్యమని నిర్ణయించుకుని ఉదయాన్నే పాలేరు గ్రామంలో ఉన్న గుడికి వెల్దామని చెప్పి తమ చిన్న కుమారుడి ఆటోలో జీళ్ళచెర్వు నుంచి బయలు దేరి పాలేరుకు చేరుకోగా, ఇంట్లో నిమ్మకాయలు మరిచిపోయామని వెళ్ళి తీసుకురావలసిందిగా తమ చిన్న కుమారుడికి తల్లి చెప్పి పంపించింది.ఇంటికి వెళ్ళి చూడగా ఇంట్లో సూసైడ్ నోట్ ను చూసిన ఆశ్చర్యానికి గురయి వెంటనే ఘటనా స్ధలానికి చేరుకోగా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఈ ఘటనలో సలీం తన తండ్రిని ముందు రిజర్వాయర్ లోకి తోసేసి తరువాత తన తల్లి, భార్యను కూడా తమ చీరలకు ముడి వేసి, తన పిల్లలకు కూడా తాడు కట్టి వారిని నీటిలోకి తోసేసి తరువాత తను కూడా దూకేసాడు. ఈ ఘటన ఉదయం 4 గంటల సమయంలో జరిగిందని ఉన్నతాదికారులు చెబుతున్నారు. మృతులలో పెంటుసాహెబ్(55), మెహబూబ్ బీ(50), సలీం(30), రజియా(27), సానాజ్(5), నస్రీన(7) ఇందులో ఇప్పటి వరకు 5 మృతదేహాలు లభ్యం కాగా మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్దిక ఇబ్బందులే కారణమని స్థానికులు అంటున్నారు. ఈ సంఘటనతో పాలేరు గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.