హైదరాబాద్ డిసెంబర్ 13 : ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి . ఇప్పటికే విడుదలయిన పోస్టర్స్ కి పాటలకి మంచి స్పందన వస్తుంది. తెలుగుదనం ఉట్టిపడే సాంగ్స్ అయితే భారీగా అంచనాలు పెంచేస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేసి ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులో ఈ నెల 21వ తేదీన ఆడియో వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
సినిమా టీమ్ ఈ విషయమై స్పష్టమైన ప్రకటన చేస్తూ స్పెషల్ గా వొక పోస్టర్ ను రిలీజ్ చేసింది. క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ , మురళీ శర్మ , కళ్యాణ్ రామ్ , రానా,సుమంత్, విద్యాబాలన్, నిత్యామీనన్, రకుల్ , హన్సిక తదితరులు నటించనున్నారు . ఎన్నో ప్రత్యేకతలు మరెన్నో విశేషాల సమాహారంగా ఈ సినిమా వస్తుంది . మన తెలుగు జనం " నిలువెత్తు తెలుగుధనాన్ని" వెండి తెర మీద చూడడానికి ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
#NTRBiopic Trailer on December 16th in Hyderabad & Grand audio launch on December 21st at Nimmakuru. #NandamuriBalakrishna @DirKrish @vishinduri @mmkeeravaani @gnanashekarvs @USTelugu @sahisuresh #NTRKathanayakudu#NTRMahanayakudu#NTRTrailerOnDec16#NTRAudioOnDec21 pic.twitter.com/qHs67ubAZL
— NBK FILMS (@NBKFilms_) December 12, 2018