హైదరాబాద్, డిసెంబర్ 12: ఏపీకి వెళ్లి వైసీపీ అధినేత జగన్ కు మద్దతిస్తానని ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ వొవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబుకు తన సొంత రాష్ట్రంలోనే వ్యతిరేకత ఉందని, ఈసారి రెండు ఎంపీ స్థానాలు కూడా గెలవలేరన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసినా తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఫలితాలు సాధించలేకపోయారని అన్నారు. ఏపీలో తాను ప్రచారం చేస్తే, ప్రభావం ఎలా ఉంటుందో చంద్రబాబుకు తెలుస్తుందని అన్నారు.