టిఆర్ఎస్ఎల్ఫీగా కెసిఆర్ ఏకగ్రీవం.!

SMTV Desk 2018-12-12 17:25:50  KCR, Telangana Elections, Pramana Sweekaram

హైదరాబాద్, డిసెంబర్ 12: టీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెరాస నుంచి గెలిచిన 88 మంది ఎమ్మెల్యేలు ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా, రేపు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్, మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై సాయంత్రానికి స్పష్టత రానుంది. రేపు కెసిఆర్ తో పాటు మరో మంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ప్రొటెం స్పీకర్ గా రెడ్యా నాయక్ ను నియమించాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.