కేసీఆర్ కు పలువురు ప్రశంసలు...!

SMTV Desk 2018-12-11 15:14:25  KCR, YS Jagan, Mamatha Benarji, Nitheesh Kumar

హైదరాబాద్‌, డిసెంబర్ 11: తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో భారీ మెజార్టీ సొంతం చేసుకుని విజయంవైపు దూసుకుపోతున్న తెరాస అగ్రనేత, సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గజ్వేల్‌ నియోజకవర్గంలో కేసీఆర్‌ 50వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఈరోజు ఉదయం కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచీ గెలుపు బాటలో కారు దూసుకెళ్తుండటంతో తెరాస ఘన విజయం ఖాయమైపోయింది. ఇప్పటివరకు తెరాస 53 స్థానాల్లో ఘనవిజయం సాధించగా.. మరో 35 స్థానాల్లో ముందంజలో తెరాస కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు వైకాపా అదినేత వైఎస్‌ జగన్‌, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, కర్ణాటక సీఎం కుమార స్వామి ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు.