2.ఓ ఎఫెక్ట్

SMTV Desk 2018-12-11 12:55:45  shankar,robo 2.o,rajini kanth

చెన్నై ,డిసెంబర్ 11 :
శంకర్ దర్శకత్వం లో సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా వచ్చిన చిత్రం రోబో 2.ఓ . ఈ చిత్రం ద్వారా శంకర్ ప్రేక్షకులకి వొక సందేశం ఇచ్చాడు . అదేంటంటే పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల జంతు జీవజాలం అంతరించిపోతుందని , అది చివరికి మన అంతానికి దారితీస్తుందని , సెల్ ఫోన్ వాడకం వల్ల పక్షిజాతులుఅంతమవుతున్నాయని తెలియజెప్పారు. అంతే కాకుండా మనం వాటి మనుగడకి ఎదోవిధంగా సహాయం చేయడం మన కనీసం భాద్యత అని సందేశం ఇచ్చారు .
ఆ సందేశం తో కనువిప్పు పొంది కొందరు తమ ఇంటి గోడలపై పక్షుల కోసం ధాన్యపు గింజలు నీటి ఉంచారు . కాగా తన పడిన తపనకు ఇలాంటి స్పందన రావడం తో ఆ వీడియో లింక్ శంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నాడు .