అనారోగ్యం కారణంగా ఇవే నా చివరి ఎన్నికలు అని ప్రకటించిన ఎమ్ఐఎమ్ నేత అక్బరుద్దీన వొవైసీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విజయాన్ని అందుకున్నారు. ఓట్ల లెక్కింపులో భాగంగా తొలి ఫలితం వెల్లడి అయింది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా ఆయన గెలిచారు. ఇక్కడ బీజేపీ నుంచి బరిలో నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని సయ్యద్ షహజాదీ ఓటమి పాలయ్యారు. చంద్రాయణగుట్ట నియోజక వర్గం నుంచి ఆయనకు ఇది ఐదవ గెలుపు.