జగిత్యాల, డిసెంబర్ 11: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఓటమి కాంగ్రెస్ పార్టీకి ఎదురయింది. జగిత్యాల మహాకూటమి అభ్యర్థి జీవన్ రెడ్డి టీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ చేతిలోదారుణంగా పరాజయులయ్యారు. 40,000 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ నేత సంజయ్ చేతిలో ఓటమి చవిచూశారు. మరోవైపు నాగార్జున సాగర్ లోనూ కాంగ్రెస్ నేత జానారెడ్డిపై నోముల నర్సింహయ్య వెయ్యి ఓట్ల మెజారిటీతో సాగుతున్నారు.
కాగా, ఫలితాలు వెలువడకముందే జీవన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెనుదిగిగారు. ఇదిలావుంచితే, మహాకూటమి తరఫున జీవన్ రెడ్డి విజయం సాధిస్తారని లగడపాటి రాజగోపాల్ చెప్పారు, ఆయన సర్వే అంచనాలు కూడా తప్పు అయ్యాయి. లగడపాటి ఆయనకు ఫోన్ చేసి ‘మీరు మంత్రి కాబోతున్నారు.. కంగ్రాట్స్ అని కూడా చెప్పారు.