హైదరాబాద్, డిసెంబర్ 10: ప్రగతిభవన్లో తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ను మజ్లిస్ అధినేత అసదుద్దీన్ వొవైసీ సమావేశం అయ్యారు. పోలింగ్ అనంతర పరిణామాలపై చర్చించేందుకు వీరిద్దరూ భేటి అయ్యారు. కెసిఆర్తో సమావేశం అయ్యేందుకు ఆసద్ ప్రగతి భవన్కు బులెట్ బైక్పై చేరుకోవడం విశేషం. సమావేశానికి కొద్దిసేపటి ముందు ఆసద్ కాబోయే ముఖ్యమంత్రితో సమావేశం కాబోతున్నాను అని ట్విట్ చేశారు.
అనంతరం, మీడియాతో అసదుద్దీన్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ అధికారంలో కొస్తుందని తనకు పూర్తి నమ్మకముందని, పార్టీ విజయం పట్ల కేసీఆర్ కూడా విశ్వాసంతో ఉన్నారని అన్నారు. ప్రజలు కేసీఆర్ ను మరోసారి దీవించారని, టీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరి అవసరం లేకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, చెప్పిన అసదుద్దీన్, తాము 8 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని అన్నారు