హైదరాబాద్, జూలై 25 : డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని అకున్ సబర్వాల్ విచారిస్తున్నారు. ఇందులో భాగంగా కొందరి నుంచి గోళ్ళు, రక్తం, జుట్టు సేకరిస్తున్నారు. కాగా డ్రగ్స్ తో సంబంధాలు ఉన్న వారు మాత్రం భయపడి ఎత్తుగడలు వేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల దృష్టికి వచ్చింది. వారి ఒంట్లో నిజంగా డ్రగ్స్ ప్రభావం ఉంటే దాని నుంచి బయటపడేందుకు అలోవీరా జ్యూస్ తాగి మరీ విచారణకు హాజరవుతున్నట్లు గుర్తించారు. అది ఎంతవరకు నిజమో కాని ఈ కేసు విషయంలో మాత్రం ప్రభుత్వం పకడ్బందీగా విచారణ కొనసాగించనుంది. ఈ విచారణపై ఎప్పటికప్పుడు సీఎంకు ఎక్సైజ్శాఖ నివేదికలు పంపిస్తోంది. అంతేకాకుండా అవసరమైతే డోపింగ్ టెస్ట్ మిషన్ తీసుకురావాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం.