తెలంగాణ లో సీపీఎం పార్టీ

SMTV Desk 2017-07-25 18:16:20  CPM, Party, 22, Conferences, in, hyderabad,

న్యూఢిల్లీ, జూలై 25 : తెలంగాణలో తమ పార్టీని బలోపేతం చేయడానికి సీపీఎం పార్టీ వర్గాలు కసరత్తులు ప్రారంభించాయి. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జాతీయ మహాసభలు హైదరాబాద్ లో నిర్వహించనుందని తెలిసింది. 2019 ఎన్నికల దృష్టిలో పెట్టుకొని తెలంగాణ లో పార్టీని బలోపేతం చేయడానికి హైదరాబాద్ లో మహాసభలను నిర్వహించాలని చూస్తున్నారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి ఈ జాతీయ మహా సభలు జరుగుతాయి. అందులోనే పార్టీ జాతీయ కార్యదర్శిని ఎన్నుకోవడం జరుగుతుంది. 21 వ జాతీయ మహాసభలు 2015 లో విశాఖపట్నంలో నిర్వహించారు. విశాఖపట్నం లో జరిగిన మహాసభలలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరిని ఎన్నుకున్నారు. ఈ మేరకు సోమవారం ప్రారంభమైన కేంద్ర కమిటి సమావేశాల్లో 22 వ జాతీయ మహా సభలు హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.