హైదరాబాద్‌కు ఏమవుతోంది?

SMTV Desk 2018-12-08 13:01:34  Koratala SHiva, Telangana Elections

హైదరాబాద్, డిసెంబర్ 08. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ.. హైదరాబాద్‌ నగర ఓటరు సిగ్గుపడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3గంటల సమయంలో హైదరాబాద్‌లో కేవలం 35 శాతమే పోలింగ్‌ నమోదవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ ట్వీట్‌ పెట్టారు. ‘హైదరాబాద్‌కు ఏమవుతోంది? 3 గంటల సమయంలోనూ ఇంకా 35 శాతమే పోలైందా? నగర ఓటర్లు సిగ్గుపడాలి అని మండిపడ్డారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 56.17 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా మెదక్‌ నియోజకవర్గంలో 75.75శాతం పోలింగ్‌ నమోదు కాగా, యాకుత్‌పురాలో అత్యల్పంగా 32శాతం నమోదవడం గమనార్హం.