హైదరాబాద్, డిసెంబర్ 8: రాజధాని హైదరాబాద్ నగర నడిబొడ్డులో దారుణం జరిగింది. కూకట్పల్లి, కైతలాపూర్ డంపింగ్ యార్డ్ దగ్గర ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటిచారు. శనివారం ఉదయం డంపింగ్ యార్డ్ కి వెళుతున్న జీహెచ్ఎంసీ కార్మికులు శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మృతుడు బోరబండ రాధాకృష్ట నగర్ కు చెందిన జున్నాడ శ్రీనివాస్ (38)గా గుర్తించారు. శుక్రవారం ఉదయం నుంచి శ్రీనివాస్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.