హైదరాబాద్, జూలై 25 : కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి మంగళవారం హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి మియాపూర్ భూకుంభకోణంలో సంబంధించిన నిందితులను అరెస్ట్ చేయాలని ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు ప్రధాన నిందితుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ హైదరాబాద్ లో తిరుగుతున్నా అరెస్ట్ చేయడం లేదని ఆయన ఆరోపణ చేశారు. దీని పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతాయని ఆయన పేర్కొన్నారు.