విజయవాడ, డిసెంబర్ 6: ఆటో మొబైల్ రంగంలో కీలక అడుగు వేసిన ఏపీ ప్రభుత్వం. రాబోయే తరం పర్యావరణ రవాణా పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కియా మోటార్స్తో రాష్ట్ర ప్రభుత్వం వొప్పందం కుదుర్చుకుంది. ఈరోజు ఉదయం సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్, ఎలక్ట్రికల్ కార్లను సిఎం చంద్రబాబు ప్రారంభించారు. బాబు ప్రారంభించిన ఎలక్ట్రికల్ కార్లను కియా మోటార్స్ రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చింది.
ఈ కార్లకు వొకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం సాగించవచ్చు. ఇందుకోసం విజయవాడలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కియా మోటార్స్ సన్నాహాలు చేస్తుంది.