హైదరాబాద్, డిసెంబర్ 5: తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో, సమయం తక్కువగా ఉండటం వల్ల, ఇక్కడ జనసేన పోటీ చేయడంలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని,ఎంతోమంది యువకుల,అమరుల త్యాగాలను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిని తానని స్పష్టంచేశారు.
తెలంగాణను ఇచ్చామ్, తెలంగాణాని అభివృద్ధి చేసామ్, తెలంగాణను తెచ్చామనేవాళ్లు, ఇప్పుడు మన ముందు ఉన్నారని... వారిలో ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయరాదనే అయోమయంలో ప్రజలందరూ ఉన్నారని తెలిపారు. ఎవరు అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనీ ఆకాంక్షిస్తారో, ఎక్కువ పారదర్శకత, తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పరిపాలనను అందిస్తారో... క్లుప్తంగా ఆలోచించి వారికి ఓటు వేయాలని చెప్పారు.