హైదరాబాద్,డిసెంబర్ 5: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసిఆర్కు ఓట్లు మాత్రమే ముఖ్యమని, మన బతుకులు ఏమైపోయిన ఆయనకు పట్టదు అని కాంగ్రెస్ నేత కొడంగల్ అభ్యర్థి రేవంత్రెడ్డి విమర్శించారు. ఈరోజు కొడంగల్ రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ..అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి గొర్రెల కన్నా హీనంగా లాక్కుపోతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రైతులెవరూ బ్యాంకుల దగ్గర తీసుకున్న రుణాలు చెల్లించవద్దని రేవంత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలు మాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ప్రజలు అందరు అత్యధిక ఓట్లతో మహాకూటమి అభ్యర్థుల్ని గెలిపించాలి అని కోరారు.