బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమ్మె

SMTV Desk 2017-07-25 13:47:24  BSNL, Employees, Strike

న్యూఢిల్లీ, జూలై 25 : దేశ వ్యాప్తంగా ఈ నెల 27 న 24 గంటల సమ్మెను బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు చేయనున్నారు. వేతనాలు పెంచనందుకు నిరసన బాట పట్టనున్నారు. సంస్థల పనితీరును ఆధారంగా జీతాలు పెంచాలని మూడో వేతన సవరణ సంఘం సిఫార్సు చేసింది. దీని ప్రకారం వరుసగా మూడేళ్ల పాటు లాభాలు ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థలకే జీతాలు పెంచే వెసులుబాటు ఉంటుంది. ఈ అవకాశం బీఎస్ఎన్ఎల్ కు లేకపోవడం తో ఈ సమ్మె చేస్తున్నారు.