సమయం లేదు మిత్రమా అంటున్న బాలయ్య...!

SMTV Desk 2018-12-04 18:04:53  Bala krishna, KCR, Chandrababu

హైదరాబాద్,డిసెంబర్ 4: హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగు ప్రజలకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) గురించి తెలియని రోజుల్లోనే చంద్రబాబు దాని గురించి నిర్వచనం ఇచ్చారు అని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. బాబు కట్టిన భవనాల్లో ఉంటూ కేసీఆర్ ఆయన పైనే విమర్శలు చేస్తున్నారు అని అన్నారు. ఓల్డ్ బోయినపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజాకూటమి రోడ్ షోలో అయన పాల్గొన్నారు.

తెలుగువారికి కష్టం వస్తే బెంగుళూరు, ఉత్తరాఖండ్ వరకు వెళ్లి పోరాడం, తెలుగు వాళ్ళకి ఏ కష్టం వచ్చిన ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి వారి తరపున పోరాడతాం అని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని కోరారు. సమయం లేదు మిత్రమా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవటమే అని ఆయన ప్రసంగాన్ని ముగించారు.