తెనాలి ఎమ్మెల్యే వర్గం సనత్‌నగర్‌లో డబ్బు పంపిణి : తలసాని

SMTV Desk 2018-12-03 19:29:13  talasani srinivas yadav,chandrababu

హైదరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణలో చంద్రబాబు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని సనత్‌నగర్‌ తెరాస అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారు అని మండిపడ్డారు. తెనాలి ఎమ్మెల్యే వర్గం వచ్చి సనత్‌నగర్‌లో డబ్బు పంచుతున్నారు అని ఆరోపించారు. టీడీపీ అభ్యర్థులు డబ్బుతో దొరికిపోతే మీడియా లో వాళ్ళ పేరులు ఎందుకు చెప్పట్లేదు అన్నారు.

అమీర్పేట హోటళ్ళలో ఎలక్షన్ కమిషన్ సోదాలు జరపగా భారీగా నగదు పట్టుబడింది. పలు నాయకుల దగ్గర 4.5 లక్షలు దొరికాయ్. కొంతమంది యువకులని పోలీసులు అరెస్ట్ చేసారు.