హైదరాబాద్, డిసెంబర్ 3:నేచురల్ స్టార్ నానికి ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు , సరైన విజయం కోసం చూస్తున్న నాని ప్రస్తుతం 'జెర్సీ' సినిమా చేస్తున్న సంగతి మనకి తెలిసిందే . అది అటుంచితే నాని తరువాత సినిమాల మీద చాల ఊహాగానాలు వచ్చాయి . తాజా గా వాటిలో వొకటి నిజమని ప్రకటన వెలువడింది . అదే మైత్రి మూవీస్ పతాకం పై విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో వస్తున్న చిత్రం . ఈ సంగతి నాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా " విక్రమ్ ఇంకా ఆ మిగతా ఐదుగురు వచ్చే సంవత్సరం లో, అమ్మాయిలు ఇది కేవలం మీకోసమే " అంటూ తన ఫాన్స్ తో పంచుకున్నాడు . సినిమా పేరు ఇంకా ఖరారు కానీ ఈ చిత్రానికి నేషనల్ అవార్డు విజేత పీసీ శ్రీ రామ్ సినిమాటో గ్రాఫర్ గా చెయ్యడం విశేషం ఈ కంబినేషన్లో మనం మాంచి క్లాస్ సినిమా ఊహించుకోవచ్చు . కాగా నాని , విక్రమ్ గోడ మీద కూర్చుని సంభాషిస్తున్న పోస్టర్ వైరల్ అవుతుంది.
#Nani24
— Hi Nani (@NameisNani) December 2, 2018
నేను, విక్రమ్ ఇంకా ఆ మిగతా ఐదుగురు.
వచ్చే సంవత్సరం లో :))
Girls !! This ones for you 🤗@MythriOfficial @Vikram_K_Kumar and the legendary @pcsreeram sir pic.twitter.com/l3lj5II2N2