బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాం

SMTV Desk 2018-11-26 19:20:31  TRS, CM kcr, Karimanagar,

కరీంనగర్ , నవంబర్ 26:రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాను టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చెయ్యబోతుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలను టీఆర్ఎస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచి వొక స్థానంలో ఓటమి పాలయ్యామని అయితే ఈసారి 13 స్థానాలు గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేసారు.

తనకు వచ్చిన సర్వేలో తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీయే విజయం సాధిస్తుందని తెలిపారు. బంపర్ మెజారిటీతో గెలవబోతున్నామని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ కు రాష్ట్రవ్యాప్తంగా అనుకూల పవనాలు వీస్తున్నట్లు తెలిపారు. తాను రాష్ట్రం అంతా తిరుగుతున్నానని ఎక్కడ చూసినా సానుకూల వాతావరణం ఉందన్నారు.