సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు

SMTV Desk 2018-11-26 15:46:35  Sonia Gandhi, Utham Kumar reddy,

హైదరాబాద్, నవంబర్ 26: టిఆర్‌ఎస్‌ పాలనలో పేదలకు లబ్ది చేకూరలేదని టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీట్‌ ది ప్రెస్‌లో మాట్లాడుతు దేశంలో సిగ్గు, శరంలేని సిఎం కెసిఆర్‌ వొక్కరే అని వ్యాఖ్యనించారు. అణగారినవర్గాలకు మాట్లాడే అవకాశం కేసీఆర్‌ ఇవ్వలేదన్నారు. ఎంతో మంది కష్ట ఫలితమే తెలంగాణ అని, కష్టతరమైనా సోనియా తెలంగాణ ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.ర సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. తెలంగాణ ఇచ్చినవారినికెసిఆర్‌ కించపర్చుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టులదీ కీలకపాత్రే అని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం వస్తే తెలంగాణలోని మండల స్థాయి స్ట్రింగర్ల నుంచి రాష్ట్రస్థాయి జర్నలిస్టుల వరకు 18 వేల మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు, పిల్లలకు విద్య, వైద్యం అందిస్తామన్నారు ఉత్తమ్‌.