ఘోర రోడ్డు ప్రమాదం

SMTV Desk 2017-07-24 18:05:13  Grave, road, accident

భద్రాద్రి, జులై 24 : కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కుంటి నాగుల గుడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు మురికి కాలువలో పడి రామకృష్ణ ( 27) బజార్ (25) అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా పడగా అతన్ని పాల్వంచ ఆసుపత్రికి తరలించారు. బజార్ అనే వ్యక్తికి రెండు నెలల క్రితమే పెళ్లైంది. అతని భార్య కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన వారు బూర్గంపాడు మండలం ఉప్పుసాకకు చెందిన వారిగా గుర్తించారు.