'మీ టూ' పై స్పందించిన ప్రముఖ నటుడు

SMTV Desk 2018-11-22 19:16:44  mee too, mohan lal

ముంబై, నవంబర్ 22: మీ టూ ఉద్యమంపై తాజాగా ప్రముఖ మలయాళ విలక్షణ నటుడు మోహన్ లాల్ సంచలన వాఖ్యలు చేశారు. మీటూ ఉద్యమం కేవలం మూణ్ణాళ్ల ముచ్చటేనని అన్నారు. మలయాళ యాక్టర్స్‌ ఛారిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మోహన్ లాల్ దుబాయ్ వెళ్ళారు. అక్కడ మీడియా మీటూపై తన స్పందనను కోరింది. మీటూ ఉద్యమంపై వ్యక్తిగతంగా తాను కామెంట్ చేయబోనని మోహన్ లాల్ స్పష్టం చేస్తూనే… ‘లైంగిక వేధింపులు అన్నవి ప్రతీచోటా వున్నాయి.

ఇలాంటివి కేవలం సినిమా ఇండస్ట్రీలోనే వుంటాయి అనుకోవడం కరెక్ట్ కాదు. మలయాళ ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యా లేదు. మీటూ ఆరోపణలు చేయడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇలాంటివి ఎక్కువకాలం నిలబడవు. ఇదంతా మూణ్ణాళ్ల ముచ్చటే. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దిలీప్ ఈ వేడుకలకు హాజరుకాడు అని స్పందించారు.