కొత్త రికార్డుని సృష్టించిన 'మహర్షి'

SMTV Desk 2018-11-22 14:35:10  maharshi, maheshbabu, vamshi paidipally

హైదరాబాద్, నవంబర్ 22: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షి తో బిజీగా వున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరుగుతుంది. ఇప్పటికే శాటిలైట్ రైట్స్ భారీ రేటుకి ఢీల్ సెట్ అవగా ఓవర్సీస్ లో కూడా మహర్షికి అదిరిపోయే బిజినెస్ అయ్యిందట.

తెలుస్తున్న సమాచారం ప్రకారం మహర్షి సినిమా ఓవర్సీస్ ఢీల్ 16 కోట్లకు క్లోజ్ అయ్యిందట. సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. వంశీ పైడిపల్లి మహేష్ మొదటిసారి కలిసి చేస్తున్న ఈ మూవీ 2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఓవర్సీస్ రైట్స్ లో మహేష్ ఇదవరకు సినిమాల కన్నా మహర్షి ఎక్కువ రేటుకి అమ్ముడవడం కొత్త రికార్డ్ సృష్టించాడు.