హైదరాబాద్, జూలై 24 : సుజిత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న మూవీ సాహో. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే విలన్ పాత్రలో నటించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అనేక చిత్రాల్లో హీరోగా నటించిన చుంకీ పాండే ను కీలక పాత్ర కోసం ఎంపిక చేశారని చిత్ర వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నీల్ నితిన్ ముఖేష్ తీసుకున్నట్లు తెలిసింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని చాలా స్టైలిష్గా తెరకెక్కించబోతున్నట్లు టీజర్ ద్వారా దర్శకుడు సుజిత్ చెప్పకనే చెప్పాడు. ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా అనుష్క శెట్టి నటిస్తున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందే ఈ చిత్రానికి శంకర్ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.