అమరావతి, నవంబర్ 21: ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వరుసగా ఎనిమిదోసారి అమరావతిలో బుధవారం నాడు తమ కుటుంబ ఆస్తులను ప్రకటించారు. రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆస్తులను ప్రకటించినట్టు చెప్పారు.
బ్రహ్మణి నికర ఆస్తి విలువ రూ. 7.72 కోట్లు, దేవాన్ష్ పేరు మీద రూ. 18.72 కోట్లు,తన ఆస్తి(నారా లోకేష్) ఆస్తి రూ. 21.40 కోట్లు . ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆస్తుల విలువ రూ. 29.9 కోట్లుగా ఉందని లోకేష్ ప్రకటించారు.భువనేశ్వరి పేరు మీద ఉన్న ఆస్తుల విలువ రూ.3101.45 కోట్లు విలువ ఉన్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరం హెరిటేజ్ నికర లాభం రూ. 6,038కోట్లు ఉందని ఆయన చెప్పారు. చంద్రబాబుపై రూ.5.31 కోట్ల అప్పులు ఉన్నాయని లోకేష్ ప్రకటించారు.