చంద్రబాబు సంచలన వాఖ్యలు

SMTV Desk 2018-11-21 13:07:50  Chandrababu naidu, YSRCP, Janasena

నెల్లూరు, నవంబర్ 21: మంగళవారం నెల్లూరులో స్థానిక ఎస్వీజీఎస్ కాలేజ్ గ్రౌండ్‌లో టీడీపీ ధర్మపోరాట దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ "తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో వైసీపీ, జనసేన ఎందుకు పోటీచేయడం లేదని ఇవి లాలూచీ రాజకీయాలకు ఇది నిదర్శనం కాదా? అంటూ సంచలన వాఖ్యలు చేశారు. దేశం కోసం కాంగ్రెస్‌తో ఉన్న 40 ఏళ్ల బేధాభిప్రాయాలు పక్కనబెట్టానని చెప్పారు. మోదీ మాటలకు, చేతలకు పొంతన ఉండదని, దేశంలో అవినీతిని బీజేపీ పెంచి పోషిస్తోందని బాబు ఆరోపించారు. సీబీఐని గుజరాత్ మనిషి ఆస్థానా బ్రష్టుపట్టించారని, దోవల్‌ కూడా ఈ ఎపిసోడ్‌లో ఉన్నారంటే దేశ పరిస్థితి ఏమవుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. అధికారం దుర్వినియోగం అవుతుందనే.. రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరించామని ఆయన స్పష్టం చేశారు.

పెద్ద నోట్ల రద్దు పెద్ద ఫార్స్‌గా మారిందన్నారు. రూపాయి విలువ పడిపోయిందని, పెట్రో ధరలు పెరిగిపోయాయని, వ్యాపారులు, రైతుల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. మోదీ మాటల ప్రధాని మాత్రమేనని, ఆయన వల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేదని చంద్రబాబు పేర్కొన్నారు.పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలను ప్రధాని మోదీ బెదిరించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కుట్రలో భాగంలోనే టీడీపీ నేతలపై ఐటీ పేరుతో దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు.