టీజేఎస్ పార్టీ 14 స్థానాల్లో పోటీ

SMTV Desk 2018-11-19 16:42:13  Telangana asembly elections, Party candidates

హైదరాబాద్, నవంబర్ 19: కూటమిలో భాఘస్వామ్యమైన టీజేఎస్ పార్టీ మొత్తం 14 స్థానాలలో అభ్యర్థులను నిలబెడతామని చెబుతోంది. ఇందులో ఐదు స్థానాల్లో మహాకూటమితో స్నేహపూర్వక పోటీ ఉంటుందని తెలిపారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఆరు స్థానాలకు గతంలోనే అభర్ధులను ప్రకటించిన టీజేఎస్ ఈరోజు పెండింగ్‌లో ఉన్న వర్ధన్నపేట, అంబర్ పేట నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. వర్ధన్నపేట స్థానాన్ని దేవయ్యకు కేటాయించగా, అంబర్ పేట స్థానాన్ని ఓయూ విద్యార్థి నేత నిజాన రమేష్‌కు కేటాయించారు. మరో ఆరు స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలబెడతామని చెబుతోంది.