ఎన్నికల వేల తెలంగాణ లో నూతన ఎస్ఐలు

SMTV Desk 2018-11-19 16:39:08  Telangana state, police acadamy, SI

హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 455 మంది ఎస్సైలు త్వరలో విధుల్లో చేరడానికి సిద్దంగా వున్నారు. ఈ క్రమంలో నిర్వహించే సింగ్‌ఔట్ పరేడ్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. పాసింగ్‌ఔట్ అవుతున్న మొత్తం 455 మంది ఎస్సైల్లో 192 మంది సివిల్ ఎస్సైలు, 69 మంది ఏఆర్ ఎస్సైలు, 183 మంది టీఎస్‌ఎస్పీ ఎస్సైలు, ఎస్పీఎఫ్ ఎస్సైలు 11 మంది ఉన్నారు. అన్ని విభాగాల్లో కలిసి 60 మంది మహిళా ఎస్సైలు ఉన్నారు. ఎన్నికల వేళ నూతన ఎస్ఐలకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించనున్నారు.