పార్లమెంట్ లో వీధి రౌడీలుగా మారిన ఎంపీలు

SMTV Desk 2018-11-17 14:16:29  Srilanka parliment, MP, War between party leaders

శ్రీలంక, నవంబర్ 17: పార్లమెంట్ లో శుక్రవారం ఘోర సంఘటన చోటు చేసుకుంది. కొద్ది సమయం వరకు పార్లమెంట్ అంతా కూరగాయల మార్కెట్ లా తయారైయింది. ఇటీవల జరిగిన బలపరీక్షలో మహీంద రాజపక్సే ఓటమి పాలయ్యారు. దీంతో శుక్రవారం రెండోసారి మరోమారు బలపరీక్ష నిర్వహించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తూ స్పీకర్‌ జయసూర్యకు నోటీసులు ఇచ్చారు. దానికి ఆయన అంగీకరించకపోవడంతో రాజపక్సే మద్దతుదారులు రెచ్చిపోయారు. ప్రతిపక్ష ఎంపీలపై కారంపొడి చల్లి నానా రచ్చ చేశారు. స్పీకర్‌పై పుస్తకాలు, నీళ్ల బాటిళ్లు విసిరారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై కూడా దాడి చేశారు. స్పీకర్ కూర్చీని పోడియం నుంచి ఈడ్చుకెళ్లారు. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు.



ఇంత జరుగుతున్నా రాజపక్సే మాత్రం తన సీటులోనే కూర్చోని ఉన్నారు. తన మద్దతుదారులను ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. తీవ్ర రాజకీయ సంక్షోభంలో ఉన్న శ్రీలకంలో ఇలాంటివి ఇంకెన్ని దారుణాలు, దాడు చూడాలో.!