శర్వానంద్‌ సరసన సాయిపల్లవి?

SMTV Desk 2017-07-24 09:39:42  sharvaanandh, sai pallavi, maaruthi, movie, tollywood, mahaanubhavudu

హైదరాబాద్, జూలై 24 : "ఫిదా" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది తమిళ నటి సాయిపల్లవి. ఈ భామ తెలుగులో మరో చిత్రంలో కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు సుధీర్‌ వర్మ తీయబోయే సినిమాలో శర్వానంద్‌ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా పల్లవిని తీసుకుంటున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ సినిమా ఆగష్టులో చిత్రీకరణ జరుపుకోనుందట. అయితే దీనికి సంబంధించిన విషయాల్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా ప్రస్తుతం శర్వానంద్, మారుతీ దర్శకత్వంలో "మహానుభావుడు" చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తైనట్లు తెలుస్తుంది.