బెంగుళూరు, నవంబర్ 16: బెంగుళూరుకు చెందిన సందీప్ శెట్టి(26), దేవరాజ్ ఇద్దరూ వ్యాపారం లో బాగస్తులు . 2016లో దేవరాజ్.. లక్ష రూపాయలు సందీప్ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడు.ఆ డబ్బు అడిగిన సందీప్ కి భూమి కొంటున్నానని.. దానిని అమ్మిన తరువాత డబ్బు తిరిగి ఇచ్చేస్తాను అని నమ్మబలికాడు. కానీ ఇప్పటి వరకూ భూమిని దేవరాజ్ కొనలేదు. దీంతో డబ్బు విషయమై వీరిద్దరి మధ్య ఏడాది నుండి వాదన జరుగుతోంది.
ఎంతకీ తన డబ్బు తిరిగి ఇవ్వలేదు అని ఆగ్రహంతో దేవరాజ్ను కత్తితో పొడిచాడు. అనంతరం సందీప్ పోలీస్ లకు లొంగిపోవాలి అని స్టేషన్కు వెళుతుండగా.. చిక్బళ్లాపుర పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. హెల్మెట్ లేదేమిటని అడిగితే తను దేవరాజ్ను పొడిచి వస్తున్నానని.. లొంగిపోయేందుకు స్టేషన్కు వెళుతున్నానని చెప్పడంతో అవాక్కవడం పోలీసుల వంతైంది. హెల్మెట్ పెట్టుకోనందుకు క్షమించాలని సందీప్ పోలీసులను వేడుకోవడం విశేషం. ప్రస్తుతం దేవరాజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.