కాంగ్రెస్ కి సవాల్ విసిరిన మోడీ

SMTV Desk 2018-11-16 16:45:13  Congress, BJP, Narendra modi

ఛత్తీస్‌గఢ్, నవంబర్ 16: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముందస్తు ఎన్నికల సందర్భంగా ఛత్తీస్‌గఢ్ శాసన‌ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం అంబికాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు దమ్ముంటే అధ్యక్ష పదవిని గాంధీ కుటుంబానికి చెందిన వారికి కాకుండా వేరే వారికి కనీసం ఐదేళ్ల పాటు ఇవ్వాలని, అప్పుడే నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యాన్ని సృష్టించారని తాను నమ్ముతానన్నారు.

మోదీ చిన్నప్పుడు టీ అమ్మిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు తరచూ ప్రసావిస్తుంటారు. మొన్నీమధ్యే కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ జవహర్లాల్ నెహ్రూ కారణంగానే ఓ చాయ్ వాలా భారతదేశానికి ప్రధాన మంత్రి అయ్యాడు అని అన్నారు. దీనిపై స్పందించిన మోదీ పై విధంగా సవాల్ చేశారు. మా కుటుంబ సంపదని, మా సింహాసనాన్నిటీ అమ్మకునే వ్యక్తి ఎత్తుకెళ్లాడని కాంగ్రెస్ అనుకుంటోంది. నాలుగు తరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదు. ఏదైన చేసుంటే చెప్పాలి అని మోదీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ది కుటుంబ పాలన అని తరచూ విమర్శించే మోదీ విసిరిన తాజా సవాల్‌పై ఆ పార్టీ నేతలు ఇంకా స్పందించలేదు.