ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఫైర్ అయిన తెరాస ఎంపీ

SMTV Desk 2018-11-16 14:27:52  Uttam kumar reddy, Kavitha, Telangana elections

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెరాస ప్రచారంలో భాగంగా ఎంపి కవిత పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై మండిపడ్డారు. తెరాసను కుటుంబ పార్టీ అని విమర్శిస్తున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్యకు కోదాడ నుంచి టికెట్ ఎందుకు ఇప్పించుకొన్నారు అని ప్రశ్నించారు.





కుటుంబసభ్యులు పదవులు చేపట్టడం తప్పు అయితే ముందుగా ఆయన భార్య పోటీ నుంచి విరమింపజేసి ఆ టికెట్ ను కాంగ్రెస్ పార్టీలో మరెవరికైనా కేటాయించాలని కవిత సూచించారు. ఈసారి కోదాడలో తెరాస ఘనవిజయం సాధించడం ఖాయమని కవిత అన్నారు. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలో అత్యధిక సీట్లు గెలిచ్చుకోబోతున్నామని కవిత చెప్పారు.

ఈసారి ఎన్నికలలో తెరాస 100కు పైగా సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారం చేపట్టబోతోందని కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కమ్మవర్గానికి చెందిన నేతలను పక్కన పెట్టినందుకు కాంగ్రెస్‌ సీనియయ్ర్ నేత రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనుకొంటున్నట్లు తాను విన్నానని కవిత అన్నారు.