మరో కొత్త పాత్రలో సూపర్ స్టార్

SMTV Desk 2018-11-16 13:46:56  Mahesh Babu, Director vamsi paidi palli, Maharshi movie

హైదరాబాద్, నవంబర్ 16: భరత్ అనే నేను సినిమాతో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు 25వ సినిమాగా మహర్షి చేస్తున్నాడు . ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో జరగనుంది . ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోలో షూటింగు కోసం భారీగా విలేజ్ సెట్ వేశారు. గ్రామీణ వ్వక్తి పాత్రలో రైతుల తరఫున మహేశ్ బాబు పోరాడే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు .

ఈ సినిమాలో అమెరికాలోని ఓ సంస్థకి సీఈవో గాను .. ఇండియాలోని ఓ మారుమూల గ్రామంలోని రైతుగాను మహేశ్ కనిపించనున్నాడు. ఇదివరకే అమెరికాలో షూటింగును పూర్తి చేసిన టీమ్, ప్రస్తుతం రైతు నేపథ్యంలోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇంటర్వెల్ కి ముందు ఈ సీన్స్ వస్తాయట. దిల్ రాజు - అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల ఉంటుంది అని చెప్పారు .