మల్లీ తనయుడితోనే వస్తున్న పూరి

SMTV Desk 2018-11-16 12:15:31  Poori jagannadh, Akash poori, Romantic new movie

హైదరాబాద్, నవంబర్ 16: ఇండస్ట్రీ లో పూరి జగనాథ్ కి వొక ట్రెండ్ మార్క్ వుండేది. అప్పట్లో పూరితో సినిమా అంటే మినిమం గ్యారంటీ వుండేది కాని ఇప్పుడు పూరికి వరుస పరాజయాలతో సతమవుతున్నాడు. తనయుడు హీరోగా చేసిన మెహబూబా కూడా దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా పూరికి పెద్ద షాక్ ఇచ్చింది. అందుకే కొద్దిపాటి గ్యాప్ తీసుకున్నాడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం మళ్లీ పూరి మరోసారి ఆకాష్ పూరితోనే మరో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఈసారి పూరి ఓ డిఫరెంట్ అటెంప్ట్ చేయబోతున్నాడట.

సినిమా టైటిల్ గా రొమాంటిక్ అని ఫిక్స్ చేశారట. అంటే ఈ సినిమా పూరి మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుందన్నమాట. సినిమాలో ఆకాష్ తో రొమాన్స్ చేసే అమ్మడు ఇంకెవరో కాదు సాయి పల్లవి అని తెలుస్తుంది. ఫిదాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాయి పల్లవి తెలుగులో మంచి ఫాంలో ఉంది. శర్వానంద్ తో పడి పడి లేచే మనసు సినిమా చేస్తున్న సాయి పల్లవి పూరి సినిమాకు ఓకే చెప్పిందని టాక్.

సినిమా కథ కూడా హీరో కన్నా ఐదేళ్లు పెద్దదైన అమ్మాయిని ప్రేమిస్తాడట. ఇద్దరి మధ్య రొమాన్స్ ఎలా ఉంటుంది అన్నది సినిమా అట. మరి పూరి చేయబోతున్న ఈ రొమాంటిక్ ఎటెంప్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. సాయి పల్లవి లాంటి పద్ధతిగల హీరోయిన్ ను రొమాంటిక్ గా మార్చేయాలన్న పూరి ఆలోచన ఫలిస్తుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.