పవన్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం

SMTV Desk 2018-11-16 11:44:10  Pawan kalyan, Road accidents

అమరావతి, నవంబర్ 16: నిన్న రాత్రి కాకినాడ నుంచి రాజానగరం బహిరంగ సభకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వెళ్తున్న కాన్వాయ్‌ను లారీ ఢీకొనడంతో పవన్‌ ప్రైవేటు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. రంగంపేట మండలంలోని రామేశంపేట వద్ద ఆయన ప్రైవేటు భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను చికిత్సనిమిత్తం రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్‌ ఆస్పత్రిలో చేర్పించారు.