ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ చైర్మన్ చాముండేశ్వరీనాథ్ మిథాలీ రాజ్ కు బంపరాఫర్ ఇచ్చారు. నేడు ఇంగ్లండ్, భారత మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్ పోరులో గెలిస్తే బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇస్తానని, అంతే కాకుండా ఈ కారును మాస్టర్ సచిన్ చేతుల మీదుగా అందజేస్తామని ఒక మీడియా సమావేశంలో అన్నారు, క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే తాను ఈ ఆఫర్ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.