న్యూ ఢిల్లీ, నవంబర్ 15: మహాకూటమి లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం టికెట్టును తనకు కేటాయించాలని హైదరాబాద్ నగర మాజీ మేయర్ బండ కార్తీక ఏకంగా అధిష్టానంపైనే నిరసన కత్తి దూశారు. ఈ రోజు ఢిల్లోలో రాహుల్ గాంధీ నివాసం ఎదుట ధర్నాకు దిగారు.
దీంతో అధిష్టానం కంగుతింది. ఏఐసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుం కుమార్ ఆమెను పిలింపించుకుని చర్చిస్తున్నారు. చర్చలు జరుపుతున్నారు. పార్టీ కోసం తానెంతో కష్టపడ్డాలని ఆమె చెబుతున్నారు. సికింద్రాబాద్ సీట్లో కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించకపోవడంతో బండతోపాటు పలువురు ఆశావాహులు ఢిల్లీలో చక్కర్లు కొడుతూ, రాహుల్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు