ముంబై, నవంబర్ 15: రంగంపేట మండలం వడిశలేరు గ్రామానికి చెందిన వొక మహిళ రోజూ కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకోస్తోంది. తన పేరు పసల బేబి. ఈ మధ్య ఈమె పాడిన పాట సామజిక మాధ్యమాల్లో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. అయితే ఈమ పాడిన పాటకు సంచలన సంగీత దర్శకుడు ఎ.ఆర్ రెహ్మాన్ సైతం ఫిదా అయ్యాడు.
అనంతరం ఆమె పాడిన పాట ని తన వ్యక్తిగత ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది గమనించిన నెటిజన్లు ‘మీ తర్వాతి ప్రాజెక్టులో బేబీకి గాయనిగా అవకాశం ఇవ్వండి సార్ అని కోరుతున్నారు. ఏఆర్ రహమాన్ గనక బేబీకి పాడే అవకాశం ఇవ్వాలి గానీ ఆమె చాలా బిజీ సింగర్ అయిపోతుంది.