ఎన్నికల్లో ప్రముఖ హాస్యనటుడు

SMTV Desk 2018-11-15 14:57:46  Telangana elections, Election candidates, Venumadhav, Indipendent

హైదరాబాద్, నవంబర్ 15: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ తెలుగు నటుడు వేణుమాధవ్ ఎన్నికల బరిలో నిలువనున్నాడట. ఈవిధంగా బుధవారం విలేకరులకు ఫోన్ చేసి తెలిపినట్టు సమాచారం.

కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయనున్నారు. వేణు మాధవ్ స్వగ్రామం ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ పట్టణం. ఇక్కడే పుట్టి విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరువాత మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి తరువాత సినిమాల్లో కూడ నటించడం జరిగింది. అనంతరం టీడీపీ ఆవిర్భావంతో ఆయన ఆ పార్టీ సభలో పాల్గొని తన మిమిక్రీ ద్వారా ప్రచాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిందే. ఆయన మిత్రబృందం కూడా రాజకీయాల్లో ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు తన నామినేషన్‌ను స్యయంగా వేయనున్నట్లు తెలిపారు.